Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆర్ఎక్స్ 200.. ఈ సారి డబుల్ డోస్ అంటున్న డైరెక్టర్..?
2018లో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆర్ఎక్స్ 100. ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దర్శకుడు అజయ్ భూపతి చాలా మంది హీరోల చుట్టూ తిరిగి చివరికి కొత్త హీరోతో చేసిన కాన్సెప్ట్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆ సినిమాలో పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఎక్కువగా ఉపయోగపడింది.
అలాగే కథలో మెయిన్ పాయింట్ ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియెన్స్ కి సరికొత్త ఫీల్ ని కలిగించాయి. ఇక ఇప్పుడు దర్శకుడు అజయ్ భూపతి ఆ సినిమాకు సీక్వెల్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు మించి ఉండేలా ఆర్ఎక్స్ 200 గా ఆ సినిమా రానున్నట్లు టాక్ వస్తోంది. డైరెక్టర్ అజయ్ దాదాపు సీక్వెల్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఇకపోతే ప్రస్తుతం మహా సముద్రం సినిమాను సెట్స్ పైకి తేవాలని చూస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది హీరోలను సంప్రదించిన అజయ్ ఒప్పించడంలో సక్సెస్ కావడం లేదు. హిట్టు సినిమా తీసినప్పటికి అతను చెప్పిన కథను చేయడానికి స్టార్స్ ముందుకు రావడం లేదు. లాక్ డౌన్ సమయంలో పలువురు హీరోలు పాజిటివ్ గా దర్శకుడికి మెస్సేజ్ పంపినట్లు తెలుస్తోంది. త్వరలోనే మహాసముద్రం సినిమాను పూర్తి చేసి ఆ తరువాత ఆర్ఎక్స్ 100 సీక్వెల్ పై దృష్టి పెట్టాలని అజయ్ ప్లాన్ చెసుకుంటున్నట్లు సమాచారం.