Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
దర్శకుడు బీ గోపాల్ పేరు విని చాలా కాలమే అయింది. ఆ మధ్య ఆచార్య కథ నాదే అంటూ వచ్చిన వ్యక్తి వల్ల బీ గోపాల్ పేరు బాగానే వార్తల్లోకి ఎక్కంది. బీ గోపాల్ వద్ద పని చేశానంటూ అతను చెప్పుకొచ్చాడు. బీ గోపాల్ ఇప్పుడు సినిమాలేవీ తెరకెక్కించడం లేదు. ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాల్లో కొత్త ట్రెండ్ సృష్టించిన బీ గోపాల్ ఇప్పుడు ఓ సినిమా ప్రమోషన్ కోసం ముందుకు వచ్చాడు.
ఆర్కే టాకీస్ బ్యానర్ సమర్పణలో కర్నూల్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త పులకుర్తి కొండయ్య నిర్మాతగా సంతోష్ పార్లవార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ప్రియతమా".. ఆనంద్ కుమార్ , నాగ వంశీ కృష్ణ, వికాస్ చంద్ర, ఉషా, ఏంజిల్, వృషాలి, ముఖ్య పాత్రదారులు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ముగ్గురబ్బాయిలు, ముగ్గురమ్మాయిలు మధ్య నడిచే ట్రయాంగిల్ లవస్టోరీ.
ఈ చిత్రం ట్రైలర్ని ఇటీవలే ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్, రవికుమార్ చౌదరి విడుదల చేశారు. కాగా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. మార్చిలో రిలీజ్కి సిద్ధమవుతోన్న ఈ సినిమా పై అంచనాలు ఉండగా తాజాగా ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేశాడు. లెజెండరీ డైరెక్టర్ బి. గోపాల్. ఈ సందర్భంగా బి.గోపాల్ మాట్లాడుతూ.. ప్రియతమా చిత్రం హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ చూశాను యూత్ ఫుల్ ఎంటర్ టైనర్గా తెరకెక్కింది అనిపిస్తుంది. ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులకు అల్ ది బెస్ట్. తప్పకుండా అందరూ ఈ సినిమా ని చూడండి.. నిర్మాత కొండయ్య గారికి అల్ ది బెస్ట్ అన్నారు.. ఈ సినిమా సక్సెస్ అయి టీమ్ అందరికీ మంచి పేరు రావాలని అన్నాడు.