Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగా హీరో సినిమాతో... నిర్మాత అవతారం ఎత్తబోతున్న దర్శకుడు!
తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ లాంటి కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) ప్రస్తుతం వెంకటేష్, నాగ చైనత్య కాంబినేషన్లో 'వెంకీ మామ' అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్టు ఒక్కటీ లేని ఈ యంగ్ డైరెక్టర్ త్వరలో నిర్మాత అవతారం ఎత్తబోతున్నారు.
బాబీ త్వరలో రొమాంటిక్ మూవీని నిర్మించబతున్నారని, ఈ చిత్రానికి అరుణ్ పవార్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. అరుణ్ పవార్ ఇంతకు ముందు 'సప్తగిరి ఎక్స్ప్రెస్' మూవీతో పాటు త్వరలో విడుదల కాబోతున్న 'వజ్ర కవచధర గోవిందా' చిత్రానికి దర్శకత్వం వహించారు.
బాబీ, అరుణ్ పవార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ను హీరోగా అనుకుంటున్నారట. 'వజ్ర కవచధర గోవిందా' ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత సాయికి స్క్రిప్టు వినిపించబోతున్నారని, ఎలాగైనా అతడిని ఒప్పించగలమనే కాన్ఫిడెన్సుతో ఉన్నట్లు తెలుస్తోంది.
బాబీ దర్శకత్వం వహిస్తున్న 'వెంకీ మామ' సినిమా విషయానికొస్తే... విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా నాయికలు. సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు .