Don't Miss!
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వెంకీమామలో చిరుకు ఆ సీన్ ఇష్టం.. ఆ విషయంపై సీరియస్.. డైరెక్టర్ బాబీ కామెంట్స్
విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య మామఅల్లుళ్లుగా నటించిన వెంకీమామ చిత్రం గత వారం విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిజ జీవితంలో మామఅల్లుళ్లైన వెంకీ, చైతు స్క్రీన్పైనా అదే రిలేషన్ షిప్లో కనిపించడం, వారి మధ్య ఎమోషన్ వర్కౌట్ అవ్వడం, అభిమానులకే గాక సగటు సినీ ప్రేక్షకుడికి సైతం కనెక్ట్ అవ్వడంతో భారీ వసూళ్లను కొల్లగొడుతూ విజయపథంలో దూసుకుపోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది.
ముఖ్య అతిథులుగా డైరెక్టర్లు..
వెంకీమామ సక్సెస్ మీట్కు టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరిలో వంశీ పైడిపల్లి, చందూ మొండేటి, త్రినాథరావు నక్కిన, నందినీ రెడ్డి లాంటి వారు వచ్చి.. వెంకీమామపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఈ చిత్ర దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. అనేక విషయాలను వెల్లడించాడు.
చైతుకు థ్యాంక్స్..
ఈ చిత్రాన్ని, కథను నమ్మి ఓకే చెప్పిన నాగ చైతన్యకు థ్యాంక్స్ తెలిపాడు. తనకు కూడా అందరి హీరోల్లా ఇంట్రడక్షన్ ఫైట్ పెట్టమని అడిగితే ఈ వెంకీమామ ఉండేది కాదని చెప్పుకొచ్చాడు. కథను మాత్రమే నమ్మి సినిమాకు ఓకే చెప్పిన చైతుకు రుణపడి ఉంటానని అన్నాడు.
వెంకీమామపై చిరు రియాక్షన్..
వెంకీమామ చిత్రాన్ని చూసిన చిరంజీవి.. తనకు ఫోన్ చేశాడని తెలిపాడు. ఆ మూవీలో నాగచైతన్య, హైపర్ ఆదిల సెల్ఫీల సీన్ బాగా నచ్చిందని, చిరు తెగ ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు. అయితే ఓ విషయంలో మాత్రమే ఫీల్ అయ్యాడని తెలిపాడు.
వెంకీని ఎందుకు కష్టపెట్టావ్..
క్లైమాక్స్ సీన్ కోసం వెంకీని ఎందుకు అంత కష్టపెట్టావ్? అని అడిగినట్టు తెలిపాడు. క్లైమాక్స్ కోసం కాశ్మీర్, మంచులో చాలా ఇబ్బంది పెట్టావ్, మా వెంకీని అంత కష్టపెట్టావ్ అని సీరియస్ అయినట్లు బాబీ తెలిపాడు. రాశీ ఖన్నా, పాయల్ రాజ్పుత్, నాజర్, రావు రమేష్, ప్రకాశ్ రాజ్ లాంటి ప్రముఖులు నటించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.