లగ్జరీ లైఫ్ కోసం ఏదైనా.. నటి హేమ బాగోతాన్ని బయటపెట్టిన స్టార్ డైరెక్టర్
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ గీతాకృష్ణ. ఆయన గురించి సినీ లవర్స్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిట్ మూవీస్ అందించిన ఆ డైరెక్టర్.. వరుస ఫెల్యూర్ రావడంతో సినిమాలు తీయడం మాని వేశాడు. అప్పడప్పడూ టాలీవుడ్ పై, హీరోలు, హీరోయిన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా డైరెక్టర్ గీతాకృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ సారి ఆయన కన్ను నటీ హేమపై పడింది. ఆమెపై పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలు ఏంటో మీరో లూక్కేయండి.
డైరెక్టర్ ఎస్. గీతా కృష్ణ 1987లో సంకీర్తన అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తన తొలి సినిమాతోనే ఉత్తమ దర్శకుడుగా నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత కోకిల, సర్వర్ సుందరం గారి అబ్బాయి, కీచురాళ్లు, ప్రియతమా, కాఫీబార్ వంటి పలు హిట్టు మూవీని అందించారు. ఆయన కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో నిమిడంగల్ అనే సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆ తరువాత సినిమాలు చేయడం మానేశాడు గీతా కృష్ణ.

డైరెక్టర్ గీతా కృష్ణ తాజాగా ఓ ఇంటర్య్వూలో నటి హేమ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..' హేమ గురించి మాట్లాడే సమయం లేదు. ఆమె అంతా పెద్ద సెలబ్రెటీ కాదు. ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి. అందుకే ఏదో సైడ్ బిజిసెన్ చేసుకుంటుంది. డ్రగ్స్ కేసులో దొరికిన, మీడియాలో ఆమె పేరు తెగ వైరలవుతున్నా.. ఏదో వీడియో పెట్టి.. నేను అక్కడ ఉన్నా.. నేను ఇక్కడ ఉన్నా అనడం ఆమె అమాయకత్వం' అంటూ సెటైర్లు వేశారు.
నటనపరంగా హేమ చాలా మంచి నటి, ఆమె క్యారెక్టర్ కు తగ్గట్టుగా ఉంటుంది. అన్నివిధాలు బాగుంటుంది. హైట్, వెయిట్, బహ్మానందం హేమ జోడీల కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. కానీ, కొన్నిసార్లు తాను బ్రహ్మానందంతో నటించనని చెప్పింది. వారికి ఎక్కడ పడలేదో తెలియదు. డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ.. ' ఆ కేసులో హేమ దొరికిన జనాలను వెర్రిపుష్పలను చేసే ప్రయత్నం చేసిందనీ, డబ్బులు లిస్తే ఎదైనా జరుగుతోంది. ఏమైనా చేయొచ్చననే ప్రయత్నం చేసింది. పైగా ఓ వీడియో పెట్టి తాను అసలు దొరకను. మీ హేమ ఎప్పుడు నవ్వుతునే ఉంటుందని డిల్డప్ ఇచ్చింది. ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇదెలా ఉంటే.. నటి హేమ ఇటీవల డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది. బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని ఫామ్హౌస్లో మే 15న నిర్వహించిన రేవ్ పార్టీలో హేమ కూడా పట్టుబడింది. తాజాగా నటి హేమ సహా ఇతర సెలబ్రెటీలపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ( సీసీబీ ) అధికారులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ రేవ్ పార్టీ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ మారింది. వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకలో భాగంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసులు దర్యాపులో తెలింది. ఆ పార్టీ నిర్వాహకుడు హేమకు బెస్ట్ ఫ్రెండ్ అంట.


Click it and Unblock the Notifications











