Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ట్రెండ్ ఫాలో అవుతున్న క్రిష్.. డేరింగ్ స్టెప్.. యువత కోసం బోల్డ్ కథ
టాలీవుడ్ దర్శకుల్లో జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) శైలి ప్రత్యేకమే. ఎన్నడూ కమర్షియల్ సక్సెస్ కోసం పాకులాడలేదు. తాను నమ్మిన సిద్దాంతాలు, విలువలతోనే చిత్రాలను తెరకెక్కించాడు. అందుకే ఓ గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి చిత్రాలు వచ్చాయి. ఇవన్నీ దర్శకుడిగా క్రిష్ స్థాయిని పెంచినవే. ఆయను ఓ గౌరవాన్ని తీసుకొచ్చినవే. అయితే ఈ మధ్య క్రిష్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు.
బెడిసికొట్టిన ‘ఎన్టీఆర్'
నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నటించిన చిత్రం ఎన్టీఆర్. కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు పార్ట్స్గా క్రిష్ మలిచాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు ఘోరపరాజయాన్ని చవిచూశాయి. ఈ దెబ్బతో క్రిష్ పునరాలోచనలో పడ్డాడు. అందుకే మరో ప్రాజెక్ట్ను పట్టాలెక్కించడానికి ఇన్ని రోజులు పట్టింది.
మణికర్ణిక వివాదం..
ఝాన్సీ లక్ష్మీబాయీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన మణికర్ణిక చిత్ర వివాదాస్పదంగా మారింది. మధ్యలో ప్రాజెక్ట్ను వదిలేసి పోయాడని కంగనా ఆరోపించగా.. స్క్రిప్ట్లో మార్పులు చేయాలంటే కంగనా ఒత్తిడి చేసిందని క్రిష్ ఆరోపించాడు. ఇలా వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది. దీంతో క్రిష్ నిత్యం వార్తల్లోకెక్కాడు.
|
తాజాగా పవన్ ప్రాజెక్ట్తో బిజీగా..
సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. చకచకా ప్రాజెక్ట్లకు ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ ప్రారంభం కాగా.. క్రిష్ కాంబోలో రాబోయే పీరియాడిక్ సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు. ఓ చారిత్రాత్మక కథను, చరిత్ర విస్మరించిన ఓ వీరుడి కథను చెప్పబోతోన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
క్రిష్లోని ఇంకో కోణం..
అయితే ఇప్పటి వరకు క్రిష్ తీసిన సినిమాలు చూస్తే.. ఆయన ఓ క్లాస్ దర్శకుడని ఎవ్వరైనా టక్కున చెప్పేస్తారు. క్రిష్ బోల్డ్ కథలు కూడా రాయగలడని ఎవ్వరైనా ఊహించి ఉంటారా? కానీ అది నిజం కాబోతోంది. అల్లు అరవింద్ ప్రారంభించిన ఓటీటీ ఫ్లాట్ఫామ్లో ‘మస్తీ' అనే ఓ బోల్డ్ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. దీనికి క్రిష్ మసాలా కథను అందించాడని టాక్. దీంట్లో నవదీప్, హెబ్బా పటేల్ నటిస్తున్నారు. ఈ మేరకు నవదీప్ షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.