Don't Miss!
- News ఊపిిరి పీల్చుకున్న ఉద్యాననగరి
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రూమర్లు నమ్మకండి.. ప్రచారం చేయొద్దు.. ప్రభాస్ మూవీపై మారుతి క్లారిటీ..
వరుస విజయాలతో దూసుకెళ్తున్న మారుతి ప్రస్తుతం పక్కా కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మీడియం రేంజ్ డైరెక్టర్గా తన మార్కు క్రియేట్ చేసుకొన్న మారుతి... పక్కా కమర్షియల్ సినిమా తర్వాత చిరంజీవి, ప్రభాస్తో మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమా గురించి లేదా కథ గురించి వస్తున్న రూమర్లను పట్టించుకోవద్దు అని మారుతి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ..
గాసిప్స్ను నమ్మకండి
ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాపైనే మా ఫోకస్ ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత తదుపరి ప్రాజెక్టు గురించి నేనే స్వయంగా ప్రకటిస్తాను. అప్పటి వరకు ఎలాంటి గాసిప్స్కు తావివ్వవద్దు. ఆ రెండు సినిమాల గురించి నేనే క్లియర్గా చెబుతాను. అప్పటి వరకు దయచేసి నా రిక్వెస్ట్ను పరిగణనలోకి తీసుకోండి అని మారుతి అన్నారు.
హారర్ కామెడీ అనే ప్రచారం
అయితే ప్రభాస్తో రూపొందించే సినిమా రాజా డిలక్స్ అనే టైటిల్ ప్రస్తుతం మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ చిత్రం హారర్ కామెడీగా రూపొందుతుంది. ప్రభాస్ కెరీర్లోని ఇది ప్రత్యేకంగా ఉంటుందనే విషయం మీడియాలో ప్రచారం అవుతున్నది.
మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ
ఇక ఇదిలా ఉండగా, గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్ బ్యానర్లో చిరంజీవితో సినిమా ఉండబోతున్నదనే విషయం పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పష్టమైంది. ఈ సినిమా గురించి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు. చిరంజీవి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమాపై, చేయబోయే సినిమాపై ఫోకస్ పెట్టండి. మన సినిమా గురించి తర్వాత మాట్లాడుకొందాం అని అనడం విశేషంగా మారింది.
కథను బట్టి రేంజ్ ఉంటుందని
చిరంజీవి, ప్రభాస్ సినిమాల గురించి మాట్లాడుతూ.. తాను పెద్ద హీరోలతో సినిమా చేసినా.. ఆ తర్వాత నా జోనర్లోనే సినిమాలు చేస్తాను. కథను బట్టి సినిమా రేంజ్ ఉంటుందే కానీ.. హీరోలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయను అని మారుతి అన్నారు. నా తరహాలోనే ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తాను అని మారుతి తెలిపారు.