Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అప్పుడే బెస్ట్ అవుట్ పుట్ వస్తుందట.. డైరెక్టర్ మారుతి కామెంట్స్ వైరల్
దర్శకుడు మారుతి తీసే సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మారుతి సినిమాలు తీయడం ప్రారంభించన కొత్తలో ఎలాంటి జానర్లను తెరకెక్కించాడు.. ఇప్పుడు ఎలాంటి సినిమాలను తీస్తున్నాడు.. ఎంతటి స్టార్డం వచ్చిందో అందరికీ తెలిసిందే. అలాంటి మారుతి ఓ జానర్ను ఎలా హ్యాండిల్ చేయాలి.. ఎలా తీస్తే మంచి అవుట్ పుట్ వస్తుందనే తాజాగా చెప్పుకొచ్చాడు. అభినవ్ సర్దార్, రామ్ హీరోలుగా చాందిని తమిలరసన్, షెర్రీ అగర్వాల్ హీరోయిన్స్ గా ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై నవ దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా 'పీనట్ డైమండ్' చిత్రంపై మారుతి కామెంట్ చేశాడు.
'పీనట్ డైమండ్' ఫస్ట్ లుక్ పోస్టర్ను మారుతి విడుదల చేస్తూ.. డైరెక్టర్ వెంకటేష్ పదేళ్లుగా తెలుసు. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఎప్పుడూ కొత్తగా చెయ్యాలి అని ఆలోచిస్తుంటాడు. నాతోపాటు మా బ్యానర్ లో చాలా సినిమాలకు వర్క్ చేశాడు. అతని ఆలోచనా విధానానికి తగ్గట్లుగానే డిఫరెంట్ స్టోరీ తో సినిమా చేస్తున్నాడు. టైటిల్ చెప్పగానే చాలా కొత్తగా వుందనిపించింది. అంతే కాకుండా పోస్టర్ చూడగానే ఇంట్రెస్టింగ్గా క్యూరియసిటీగా ఉందని మారుతి అన్నాడు.
కథ లైన్ చెప్పాడని... సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారని అలాంటి జోనర్లో సినిమా అంటే జాగ్రత్తగా డీల్ చెయ్యాలని మారుతి తెలిపాడు. అప్పుడే మనం అనుకున్న ఔట్ ఫుట్ వస్తుందన్నాడు. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మారుతి చెప్పుకొచ్చాడు. నిర్మాతలుఅభినవ్ సర్ధార్, వెంకటేష్ మాట్లాడుతూ.. సినిమా నేపథ్యం ఎలా సాగుతుందనే వివరాలను చెబుతూ ఆసక్తిని పెంచేశారు.