Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జాంబీరెడ్డి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఆలస్యమవ్వడానికి కారణమిదే!
అ! సినిమాతో డిఫరెంట్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ తరువాత కల్కి సినిమాతో కూడా డిఫరేంట్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలను అయితే అంధించలేదు. ఇక మూడవసారి నెవర్ బిఫోర్ అనే ప్రయోగంతో రాబోతున్నాడు.
టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో మొదటిసారి ఒక జాంబీ ఫిల్మ్ ను తెరకెక్కించినట్లు చెబుతూ తప్పకుండా సినిమా ఊహాలకందని రేంజ్ లో థ్రిల్ చేస్తుందని ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఓ వర్గం ఆడియెన్స్ లో ఈ సినిమా అంచనాలనైతే పెంచేసింది. ఇక సినిమా మొదట్లో సంక్రాంతికే వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 5న రానున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు.
సినిమా ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని చెబుతూ.. సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్న తరుణంలో రిస్క్ చేయడం అంత కరెక్ట్ కాదని కొంతమంది ఇండస్ట్రీ పెద్దవాళ్ళు వద్దని అన్నారని అందుకే సినిమాను ఫిబ్రవరి 5న థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు ప్రశాంత్ వివరణ ఇచ్చారు. ఈ సినిమాలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించగా దక్ష నగర్కర్ హీరోయిన్ గా కనిపించనుంది.