Don't Miss!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
టాలీవుడ్ డైరెక్టర్కు గుండెపోటు.. కూకట్పల్లి హాస్పిటల్కు తరలింపు
టాలీవుడ్ యువ దర్శకుడు రాజ్ కిరణ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం (జూన్ 12) మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. దాంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో వైద్యులు స్పందించి ఆయనకు చికిత్స అందించినట్టు సన్నిహితులు తెలిపారు.
దర్శకుడు రాజ్ కిరణ్కు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. తన అనారోగ్యం విషయాన్ని తెలియజేయడంతో ఆయనను కూకట్ పల్లిలోని ఓమిని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యానికి స్పందిస్తున్నారు అని సన్నిహితులు తెలిపారు.
ప్రముఖ దర్శక, నిర్మాత కోన వెంకట్ రూపొందించిన గీతాంజలి చిత్రం ద్వారా 2014లో రాజ్ కిరణ్ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత త్రిపుర అనే చిత్రంలో నటించారు. 2017లో లక్కున్నొడు, 2018లో విశ్వామిత్ర సినిమాలకు దర్శకత్వం వహించారు. విశ్వామిత్ర చిత్రం జూన్ 14న రిలీజ్ కానున్నది. ఈ సినిమాను స్వంత బ్యానర్పై రూపొందించి రిలీజ్కు సిద్ధమయ్యారు.