Don't Miss!
- News Shocking Video: గాల్లో ఢీకొన్న రెండు నేవీ హెలికాఫ్టర్లు-10 మంది స్టాఫ్ దుర్మరణం..!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టాలీవుడ్ డైరెక్టర్కు గుండెపోటు.. కూకట్పల్లి హాస్పిటల్కు తరలింపు
టాలీవుడ్ యువ దర్శకుడు రాజ్ కిరణ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం (జూన్ 12) మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. దాంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో వైద్యులు స్పందించి ఆయనకు చికిత్స అందించినట్టు సన్నిహితులు తెలిపారు.
దర్శకుడు రాజ్ కిరణ్కు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. తన అనారోగ్యం విషయాన్ని తెలియజేయడంతో ఆయనను కూకట్ పల్లిలోని ఓమిని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యానికి స్పందిస్తున్నారు అని సన్నిహితులు తెలిపారు.
ప్రముఖ దర్శక, నిర్మాత కోన వెంకట్ రూపొందించిన గీతాంజలి చిత్రం ద్వారా 2014లో రాజ్ కిరణ్ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత త్రిపుర అనే చిత్రంలో నటించారు. 2017లో లక్కున్నొడు, 2018లో విశ్వామిత్ర సినిమాలకు దర్శకత్వం వహించారు. విశ్వామిత్ర చిత్రం జూన్ 14న రిలీజ్ కానున్నది. ఈ సినిమాను స్వంత బ్యానర్పై రూపొందించి రిలీజ్కు సిద్ధమయ్యారు.