Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దివ్య భారతి, శ్రీదేవి మరణాలపై అర్నబ్ షాకింగ్ కామెంట్.. బాలీవుడ్ హీరోలకు భయమెందుకో వర్మ ఎటాక్
న్యూస్బాలీవుడ్ ఇండస్ట్రీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఇక ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువవుతూనే ఉన్నాయి. నెపోటిజంపై విమర్శలు ఏ రేంజ్ లో వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల ప్రముఖ న్యూస్ రిపోర్టర్ బాలీవుడ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వర్మ ట్విట్టర్ ద్వారా స్పంధించారు. ఆయన కామెంట్స్ పై సినిమా చేయబోతున్నట్లు ఎనౌన్స్మెంట్ చేసి వివాదాస్పద టైటిల్ కూడా ఎనౌన్స్ చేయడం వైరల్ గా మారింది.
Recommended Video
సుశాంత్ సింగ్ కేసుపై ప్రత్యేక డిబేట్
ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి గత కొన్నిరోజులుగా సుశాంత్ సింగ్ కేసుపై ప్రత్యేక డిబేట్ నిర్వహిస్తున్నారు. ఇక ఇటీవల డిబేట్ షోలో బాలీవుడ్పై ఒక్కసారిగా దుమ్మెత్తిపోశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో చీకటి రహస్యాలు గుట్టు విప్పాల్సిన సమయం వచ్చిందని, బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక డర్టీ అని వ్యాఖ్యానించారు.
సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది
బాలీవుడ్ కి అండర్ వరల్డ్తో కూడా సంబంధాలున్నాయని అంటూ.. 19 ఏళ్ల యువ నటి దివ్య భారతి చనిపోతే అసలు విషయం బయటకు రానివ్వకుండా చేశారని శ్రీదేవి, జియా ఖాన్ సుశాంత్ వంటి వారు మృతికి బాలీవుడ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని అర్నాబ్ పలువురు సినీ ప్రముఖుల పేర్లను కూడా ప్రస్తావించారు.
అర్నబ్: ది న్యూస్ ప్రాస్టిట్యూట్
ఈ విషయంపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ అర్నాబ్ పై అదే తరహాలో విరుచుకు పడటం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా అర్నాబ్ పై సినిమా కూడా తీయబోతున్నట్లు టైటిల్ ఎనౌన్స్ చేశారు. అర్నబ్: ది న్యూస్ ప్రాస్టిట్యూట్ అంటూ వర్మ సరికొత్తగా కాంట్రవర్సీ తో సినిమా చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేయడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకు బయపడుతున్నారో..
అదే విధంగా అర్నాబ్ గోస్వామి ఇష్టం వచ్చినట్లు ఇలా అరుస్తుంటే.. ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, మహేష్ భట్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు ఎందుకు బయపడుతున్నారో అర్థం కావడం లేదని వర్మ పేర్కొన్నారు. ఇతర బాలీవుడ్ స్టార్లు కూడా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదని వారు మౌనంగా ఉంటే కచ్చితంగా తప్పుచేసినట్టే అవుతుందని వర్మ వివరణ ఇచ్చారు.