Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శేఖర్ కమ్ముల ప్లాన్ వర్కౌట్ అవుతుందా!
శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు ఆహ్లాదభరితంగా ఉంటాయి. కమర్షియల్ అంశాలు లేకుండానే సినిమాని విజయపథంలో నడిపించగలరు. ఫిదా చిత్రంతో శేఖర్ కమ్ముల తన సత్తా నిరూపించుకున్నాడు. ఫిదా తరువాత మళ్ళీ రొమాంటిక్ లవ్ స్టోరీతోనే శేఖర్ కమ్ముల ఒక చిత్రాని తెరకెక్కిస్తున్నాడు. అంతా కొత్తవారితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై ఆసక్తి పెంచడానికి శేఖర్ కమ్ముల ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొరటాల శివ, చిరంజీవి చిత్రం.. ఆమె హీరోయిన్ కాదు కానీ!
హీరో, హీరోయిన్లని ఇప్పట్లో మీడియాకి పరిచయం చేయకూడదని శేఖర్ కమ్ములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రయోగాన్ని గతంలో గుణశేఖర్ వరుడు చిత్రం విషయంలో చేశాడు. హీరోయిన్ ని నేరుగా సిల్వర్ స్క్రీన్ పైనే చూపించారు. ఆ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు శేఖర్ కమ్ముల అదే తరహా పద్దతి ఫాలో అవుతుండడం ఆసక్తిగా మారింది.
శేఖర్ కమ్ముల చిత్రాలకు భారీ హంగులు ఉండవు. సింపుల్ గా సినిమాతీసి ఆడియన్స్ ని మెప్పిస్తారు. ఆనంద్, హ్యాపీడేస్, ఫిదా చిత్రాలు అలా విడుదలై విజయం సాధించినవే. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.