Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
శేఖర్ కమ్ముల ప్లాన్ వర్కౌట్ అవుతుందా!
శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు ఆహ్లాదభరితంగా ఉంటాయి. కమర్షియల్ అంశాలు లేకుండానే సినిమాని విజయపథంలో నడిపించగలరు. ఫిదా చిత్రంతో శేఖర్ కమ్ముల తన సత్తా నిరూపించుకున్నాడు. ఫిదా తరువాత మళ్ళీ రొమాంటిక్ లవ్ స్టోరీతోనే శేఖర్ కమ్ముల ఒక చిత్రాని తెరకెక్కిస్తున్నాడు. అంతా కొత్తవారితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై ఆసక్తి పెంచడానికి శేఖర్ కమ్ముల ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొరటాల శివ, చిరంజీవి చిత్రం.. ఆమె హీరోయిన్ కాదు కానీ!
హీరో, హీరోయిన్లని ఇప్పట్లో మీడియాకి పరిచయం చేయకూడదని శేఖర్ కమ్ములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రయోగాన్ని గతంలో గుణశేఖర్ వరుడు చిత్రం విషయంలో చేశాడు. హీరోయిన్ ని నేరుగా సిల్వర్ స్క్రీన్ పైనే చూపించారు. ఆ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు శేఖర్ కమ్ముల అదే తరహా పద్దతి ఫాలో అవుతుండడం ఆసక్తిగా మారింది.
శేఖర్ కమ్ముల చిత్రాలకు భారీ హంగులు ఉండవు. సింపుల్ గా సినిమాతీసి ఆడియన్స్ ని మెప్పిస్తారు. ఆనంద్, హ్యాపీడేస్, ఫిదా చిత్రాలు అలా విడుదలై విజయం సాధించినవే. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.