Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శేఖర్ కమ్ముల ప్లాన్ వర్కౌట్ అవుతుందా!
శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు ఆహ్లాదభరితంగా ఉంటాయి. కమర్షియల్ అంశాలు లేకుండానే సినిమాని విజయపథంలో నడిపించగలరు. ఫిదా చిత్రంతో శేఖర్ కమ్ముల తన సత్తా నిరూపించుకున్నాడు. ఫిదా తరువాత మళ్ళీ రొమాంటిక్ లవ్ స్టోరీతోనే శేఖర్ కమ్ముల ఒక చిత్రాని తెరకెక్కిస్తున్నాడు. అంతా కొత్తవారితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై ఆసక్తి పెంచడానికి శేఖర్ కమ్ముల ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కొరటాల శివ, చిరంజీవి చిత్రం.. ఆమె హీరోయిన్ కాదు కానీ!
హీరో, హీరోయిన్లని ఇప్పట్లో మీడియాకి పరిచయం చేయకూడదని శేఖర్ కమ్ములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రయోగాన్ని గతంలో గుణశేఖర్ వరుడు చిత్రం విషయంలో చేశాడు. హీరోయిన్ ని నేరుగా సిల్వర్ స్క్రీన్ పైనే చూపించారు. ఆ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు శేఖర్ కమ్ముల అదే తరహా పద్దతి ఫాలో అవుతుండడం ఆసక్తిగా మారింది.
శేఖర్ కమ్ముల చిత్రాలకు భారీ హంగులు ఉండవు. సింపుల్ గా సినిమాతీసి ఆడియన్స్ ని మెప్పిస్తారు. ఆనంద్, హ్యాపీడేస్, ఫిదా చిత్రాలు అలా విడుదలై విజయం సాధించినవే. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.