Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మేకింగ్ స్టైల్ మార్చనున్న శేఖర్ కమ్ముల.. లవ్ స్టోరీ తరువాత థ్రిల్లర్ మూవీ?
తెలుగు సినిమా చిత్ర పరిశ్రమలో ఎంత మంది స్టార్ దర్శకులు ఉన్నా కూడా అందులో కొందరికి ఉండే క్రేజ్.. స్టార్ దర్శకులకు కూడా ఉండదనే చెప్పాలి. ముఖ్యంగా యూత్, మాస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేసే వారికి ఎప్పుడైనా సరే మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి వారిలో శేఖర్ కమ్ముల ఒకరు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.
ఫిదా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ స్టార్ దర్శకుడు నెక్స్ట్ లవ్ స్టోరీ అనే క్యూట్ అండ్ ఎమోషనల్ సినిమాతో రాబోతున్నాడు. సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన ఆ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇక ఈ లాక్ డోన్ సమయంలో శేఖర్ కమ్ముల మరో స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇంతవరకు శేఖర్ కమ్ముల మేకింగ్ లో పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. ఆయన చేసిన క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీస్ మాత్రమే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు సరికొత్తగా రెగ్యులర్ గా చేసే మేకింగ్ స్టైల్ ని పక్కనపెట్టి త్రిల్లర్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని శేఖర్ కమ్ముల మాత్రం లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అనంతరం వెంటనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.