Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వెండితెరపై లాక్డౌన్ ‘వలస’ జీవుల వెతలు.. సునీల్ కుమార్ దర్శకత్వంలో మరో..
సొంతూరు, గంగపుత్రులు లాంటి సామాజిక అంశాలతో ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా చిత్రాలను తెరకెక్కించే డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి నుంచి వస్తున్న మరో చిత్రం వలస. లాక్డౌన్లో దేశవ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను కదిలించిన వలస జీవుల జీవితాలను కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపందించారు. యెక్కలి రవీంద్రబాబు నిర్మాతగా, శ్రావ్య ఫిల్మ్స్, కళాకార్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా రూపొందించిన వలస చిత్రం రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు విశాఖపట్టణంలో శరవేగంగా జరుగుతున్నాయి.
కోవిడ్ 19 పరిస్థితులు దేశవ్యాప్తంగా మధ్య, దిగువ తరగతి కార్మికులు, వేతన జీవుల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ఆరోగ్యపరమైన ఎమర్జెన్సీ దిశగా అడుగులు పడ్డాయి. అన్ని వర్గాల కార్మికులు, ప్రజలు వెతలు మాటల్లో చెప్పని విధంగా మారాయి. ఇలాంటి వ్యధ భరితమైన జీవితాలను తెరపైన ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ సునీల్ కుమార్.
లాక్డౌన్ కాలంలోనే కథ, కథనాలు పూర్తి చేసుకొని.. నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ పూర్తి చేశారు. మనోజ్ నందమ్, వినయ్ మహాదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. తేజు, గౌరీలు హీరోయిన్లుగా నటించారు. తనుషా, తులసీ రామ్, మనీషా, ఎఫ్ బాబాయ్, సముద్ర వెంకటేష్, నల్ల శ్రీను, మల్లిక, చిన్నారి, సాజిద్, రామన్, వాసు తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.
వలస చిత్రానికి సంగీతం ప్రవీణ్ ఇమ్మడి, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నరేష్ కుమార్ మాడికి, కలరింగ్ శ్యామ్ కుమార్ పీ, ఆడియోగ్రఫి ప్రదీప్, కథ, స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పాటలు: సునీల్ కుమార్ రెడ్డి అందించారు. త్వరలోనే థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు.