Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నిజంగా చెప్పాలంటే 'సైరా నరసింహా రెడ్డి'లో హీరో రామ్చరణ్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి
తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమాకి సంబందించి పలు విశేషాలు పంచుకున్నాడు. ఆ వివరాలు చూస్తే..
తండ్రికి బహుమతిగా అందించాలని రామ్చరణ్
సైరా నరసింహా రెడ్డి సినిమాను తన తండ్రి చిరంజీవికి బహుమతిగా అందించాలని రామ్చరణ్ భావించాడని, అందుకే ఈ సినిమాపై ఆయన ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని చెప్పాడు సురేందర్ రెడ్డి. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ముందుకు నడిపారని అన్నాడు. షూటింగ్ సమయంలో తనకు కూడా రామ్ చరణ్ ఎలాంటి షరతులు విధించలేదని ఆయన పేర్కొన్నాడు.
ఓ రకంగా చెప్పాలంటే..
సైరా కోసం రామ్ చరణ్ తీసుకున్న జాగ్రత్తలు, పడిన కష్టం చూస్తే.. సైరా చిత్రానికి నిజమైన హీరో రామ్ చరణే అని చెప్పుకోవచ్చంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించాడు సురేందర్ రెడ్డి. చారిత్రాక నేపథ్యంలో తెరకెక్కిన ఇలాంటి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమాపై అమితమైన ఆసక్తి నెలకొంది జనాల్లో.
అప్పటి పరిస్థితులను అద్దంపట్టేలా..
ఆనాటి పరిస్థితులను తలపించేలా అద్భుతమైన సెట్స్ వేసి సైరా నరసింహా రెడ్డి రూపొందించారు. ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి నటించగా, ఆయన భార్య పాత్రలో నయనతార నటించింది. మరో హీరోయిన్ తమన్నా ముఖ్య పాత్ర పోషించింది. అనుష్క కూడా నటించిందని టాక్. కాకపొతే ఆమె పాత్రను సీక్రెట్గా ఉంచారని సమాచారం.
సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.