Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నిజంగా చెప్పాలంటే 'సైరా నరసింహా రెడ్డి'లో హీరో రామ్చరణ్.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి
తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమాకి సంబందించి పలు విశేషాలు పంచుకున్నాడు. ఆ వివరాలు చూస్తే..
తండ్రికి బహుమతిగా అందించాలని రామ్చరణ్
సైరా నరసింహా రెడ్డి సినిమాను తన తండ్రి చిరంజీవికి బహుమతిగా అందించాలని రామ్చరణ్ భావించాడని, అందుకే ఈ సినిమాపై ఆయన ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని చెప్పాడు సురేందర్ రెడ్డి. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ముందుకు నడిపారని అన్నాడు. షూటింగ్ సమయంలో తనకు కూడా రామ్ చరణ్ ఎలాంటి షరతులు విధించలేదని ఆయన పేర్కొన్నాడు.
ఓ రకంగా చెప్పాలంటే..
సైరా కోసం రామ్ చరణ్ తీసుకున్న జాగ్రత్తలు, పడిన కష్టం చూస్తే.. సైరా చిత్రానికి నిజమైన హీరో రామ్ చరణే అని చెప్పుకోవచ్చంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించాడు సురేందర్ రెడ్డి. చారిత్రాక నేపథ్యంలో తెరకెక్కిన ఇలాంటి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమాపై అమితమైన ఆసక్తి నెలకొంది జనాల్లో.
అప్పటి పరిస్థితులను అద్దంపట్టేలా..
ఆనాటి పరిస్థితులను తలపించేలా అద్భుతమైన సెట్స్ వేసి సైరా నరసింహా రెడ్డి రూపొందించారు. ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి నటించగా, ఆయన భార్య పాత్రలో నయనతార నటించింది. మరో హీరోయిన్ తమన్నా ముఖ్య పాత్ర పోషించింది. అనుష్క కూడా నటించిందని టాక్. కాకపొతే ఆమె పాత్రను సీక్రెట్గా ఉంచారని సమాచారం.
సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.