Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభాస్ ‘సలార్’లో ఏకంగా ముగ్గురు: అంతా బాలీవుడ్ నుంచే అంటున్నారే!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్'. జిల్ ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది పట్టాలపై ఉండగానే ఏకంగా మరో మూడు సినిమాలను ప్రకటించాడీ యూనివర్శల్ స్టార్ హీరో. అందులో KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందించబోయే సినిమా ఒకటి. 'రాధే శ్యామ్' తర్వాత ప్రభాస్ నటించబోయే సినిమా ఇదే కావడంతో దీనిపై అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని KGF నిర్మాణ సంస్థ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు.
Recommended Video
'సలార్' పూర్తి మాస్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంతో క్రూరంగా ఉండబోతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన వారికి అర్థం అవుతోంది. అలాగే, అతడి ఎలివేషన్ సీన్స్ కూడా అదిరిపోయేలా రూపొందించనున్నాడట ప్రశాంత్ నీల్. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో ఇద్దరిని కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ కోసం తీసుకోబోయే మరో ఇద్దరు హీరోయిన్లను కూడా బాలీవుడ్కు చెందిన వారికే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. హిందీ మార్కెట్ను టార్గెట్ చేసేందుకే ఈ ప్లాన్ వేసిందట చిత్ర యూనిట్. అంతేకాదు, కీలకమైన పాత్రల కోసం కొంత మంది హిందీ నటులను తీసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక, ఈ సినిమా తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.