Klin Kaara: క్లీంకార కేర్ టేకర్కు నెల జీతం అన్ని లక్షలా.. ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేశారంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతుల ముద్దుల పాప పేరు క్లీంకార. ఈ బుడ్డది పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా సంతోషంతో తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ చిన్నది పుట్టినప్పటి నుంచి మాత్రం ఆమె ఫేస్ను మాత్రం రివీల్ చేయలేదు. ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇప్పుడీ పాపకు ఓ కేర్ టేకర్ను నియమించారు చరణ్ దంపతులు. ఇప్పుడామెకు ఇస్తున్న నెల జీతం సోషల్ మీడియాలో షాకింగ్గా మారింది? అసలు ఆమెనే ఎందుకు ఎంపిక చేశారు? నెలకు ఎన్ని లక్షలు ఇస్తున్నారు? వంటి విషయాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కొణిదెల కపుల్ ప్రస్తుతం తల్లిదండ్రులుగా తమ కుమార్తె క్లీంకారతో కలిసి లైఫ్ను హ్యాపీగా గడుపుతున్నారు. తమ ముద్దుల కూతురి కోసం సమయం కేటాయించి తనతోనే ఉంటున్నారు. ఈ చిన్నారి కోసం భారీ ఖర్చుతో ప్రత్యేకంగా గదిని కూడా తీర్చిదిద్దారు. ఇకపోతే క్లీంకారను చూడాలని మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ చరణ్, ఉపాసన మాత్రం కూతురుతో బయటకు వెళ్లినా కూడా ఆ చిన్నారి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. మెగాఫ్యామిలీ ఫంక్షన్స్ ఫొటోస్ను పోస్ట్ చేసినా కూడా అందులో చిన్నారి ఫేస్కు లవ్ ఎమోజీలు పెట్టి షేర్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడా మెగా ఫ్యామిలీ ముద్దుల పాప క్లీంకారకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇప్పుడు మళ్లీ చరణ్ - ఉపాసన కాస్త బిజీ కానున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ వరుసగా తన షూటింగ్లలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారట. అటు ఉపాసన కూడా అపోలో హాస్పిటల్ బాధ్యతలతో కాస్త బిజీగా ఉంటోంది. దీంతో క్లీంకార కోసం ఓ ప్రముఖ కేర్ టేకర్ను ఏర్పాటు చేశారని తెలిసింది.

సావిత్రి అనే కేర్ టేకర్ను నియమించినట్లు తెలిసింది. ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కొడుకు తైమూర్కు కూడా కేర్ టేకర్గా వ్యవహరించింది. దీంతో ఆమె సోషల్ మీడియాతో అందరికీ తెలిసింది. ఎందుకంటే అదే సమయంలో కరీనా ఆమెపై ప్రశంసలను కురిపించింది. అయితే సావిత్రి జీతం కూడా ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెలకు ఆమెకు లక్షన్నార ఇస్తున్నారట. రీసెంట్గా కూడా చరణ్, ఉపాసన ముంబయికి వెళ్ళినప్పుడు సావిత్రి కూడా వారితో అక్కడ కనిపించారు.
ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే పొలిటికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేయనున్నారు. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఆనందంలో ఉంది.


Click it and Unblock the Notifications











