Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
Tollywood Drugs Caseలో కీలక వ్యక్తి అరెస్ట్.. గీతామాధురి భర్తతో కలిసి విచారణ.. మరో ఇద్దరు కూడా!
టాలీవుడ్ డ్రగ్స్ కేసు అనేక మలుపులు తిరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి పలువురు సినీ ప్రముఖులను విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఒక కీలక వ్యక్తి అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
కీలకంగా మారిన కేసు
టాలీవుడ్ డ్రగ్స్ కేసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే 2017లోనే ఈ కేసు టాలీవుడ్ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది.. కొన్నాళ్లపాటు టాలీవుడ్ లోని కీలక నటీనటులు ఈ డ్రగ్స్ కేసు కారణంగా ఎక్సైజ్ అధికారుల ముందు విచారణకు కూడా హాజరయ్యారు. విచారణకు హాజరైన క్రమంలో వారి రక్త నమూనాలను అలాగే జుట్టు, గోళ్ళు వంటివి ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం ఇవ్వగా అందులో ఎలాంటి ఇబ్బందులు లేని కారణంగా అప్పట్లో కేసు మూసివేస్తున్నట్లు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రకటించారు.
పబ్ పార్టీలో
అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ కోర్టుకు ఎక్కడమే కాక గవర్నర్ దృష్టికి కూడా తీసుకు వెళ్ళడంతో ఇప్పుడు ఈ వ్యవహారంలో కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది.. ఈ డ్రగ్స్ కొనుగోళ్ల విషయంలో మనీలాండరింగ్ చట్టం ఉల్లంఘించారని విదేశాలకు డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో నుంచి పంపించి మరీ డ్రగ్స్ కొనుగోలు చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. అందులో భాగంగానే నవదీప్ కు చెందిన పబ్ పార్టీలో కనపడిన అందరినీ విచారణ జరుగుతోంది.
ఆసక్తికరంగా విచారణ
అందులో భాగంగానే ఎక్సయిజ్ కేసులో ఉన్న అందరితో పాటు రానా, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరికీ కూడా నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కాగా మరికొందరు కూడా త్వరలో విచారణకు హాజరు కాబోతున్నారు. ఈరోజు గీతామాధురి నటుడు నందు కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు విచారణ కొనసాగుతుండగానే ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.
కెల్విన్ అరెస్ట్
టాలీవుడ్ స్టార్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్ అరెస్ట్ అయినట్టు చెబుతున్నారు. కెల్విన్ ను భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించారు. బోయినపల్లి నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కెల్విన్ తరలించారు అధికారులు. నిజానికి ఈ సినీ తారల డ్రగ్స్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న కెల్విన్ ను అదుపులోకి తీసుకుని నటుడు నందుతో కలిపి ఈడీ విచారిస్తున్నట్లు చెబుతున్నారు.
Recommended Video
నలుగురిని ఒకేసారి
కెల్విన్ బ్యాంక్ డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న ఈడీ, సినీ ప్రముఖులతో సంబంధాలు, బ్యాంకు లావాదేవీలు పై మరోసారి కెల్విన్ ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కెల్విన్ సమక్షంలో నందును విచారిస్తున్న ఈడీ అధికారులు, కెల్విన్ స్నేహితులు అయినా పాత బస్తీ కి చెందిన కుదూసే , వాహిద్ ను ఈడీ కార్యాలయానికి తరలించి మొత్తం నలుగురుని కలిసి ఈడీ విచారిస్తున్నట్లు చెబుతున్నారు. మరో పక్క నటుడు నందు ను నాలుగు గంటలుగా ఈడీ విచారిస్తుండగా కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు.