Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరోనా సమయంలో ఏక్తాకపూర్ సంచలన నిర్ణయం.. రూ. 2.5 కోట్లతో
కరోనావైరస్ కారణంగా స్తంభించిన సినీ పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై హిందీ టెలివిజన్ సీరియల్స్లో మొఘల్ ఏక్తాకపూర్ స్పందించారు. లాక్డౌన్ కారణంగా రోజువారీ వేతన జీవులు కష్టాలను పరిష్కరించడానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
తన సొంత సినీ, టెలివిజన్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలింస్లో పనిచేసే రోజువారీ వేతన కార్మికులను ఆదుకొనేందుకు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఏడాది తన జీతాన్ని తన సంస్థ సిబ్బందికి విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడయా ద్వారా వెల్లడించారు.
కరోనా సంక్షోభ ప్రభావం చాలా పెద్ద ఎత్తులో ఉంది. ఈ కారణంగా సమస్యల్లో కూరుకుపోయిన వారికి ఆర్థికంగా అండగా నిలువాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే బాలాజీ టెలిఫిలింస్ కోసం పనిచేసే రోజువారీ వేతన కార్మికులు, ఫ్రీలాన్సర్లను ఆదుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను. షూటింగులు నిలిచిపోవడం వల్ల వారి జీవితం చాలా దుర్బరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆదుకోవడం నా ముందున్న తక్షణ కర్తవ్యంగా భావించాను.
నా సిబ్బందిని ఆదుకోవడానికి నా ఏడాది జీతం రూ.2.5 కోట్లు బాలాజీ టెలిఫిలింస్ సిబ్బందికి విరాళంగా అందజేస్తున్నాను. నా సిబ్బందికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకొంటాను. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కలిసి ఐక్యంగా ముందుకెళ్లాలి. ఇంటి పట్టునే ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ఏక్తా కపూర్ ఓ సందేశాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.