Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనా సమయంలో ఏక్తాకపూర్ సంచలన నిర్ణయం.. రూ. 2.5 కోట్లతో
కరోనావైరస్ కారణంగా స్తంభించిన సినీ పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై హిందీ టెలివిజన్ సీరియల్స్లో మొఘల్ ఏక్తాకపూర్ స్పందించారు. లాక్డౌన్ కారణంగా రోజువారీ వేతన జీవులు కష్టాలను పరిష్కరించడానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
తన సొంత సినీ, టెలివిజన్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలింస్లో పనిచేసే రోజువారీ వేతన కార్మికులను ఆదుకొనేందుకు సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఏడాది తన జీతాన్ని తన సంస్థ సిబ్బందికి విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడయా ద్వారా వెల్లడించారు.
కరోనా సంక్షోభ ప్రభావం చాలా పెద్ద ఎత్తులో ఉంది. ఈ కారణంగా సమస్యల్లో కూరుకుపోయిన వారికి ఆర్థికంగా అండగా నిలువాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే బాలాజీ టెలిఫిలింస్ కోసం పనిచేసే రోజువారీ వేతన కార్మికులు, ఫ్రీలాన్సర్లను ఆదుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను. షూటింగులు నిలిచిపోవడం వల్ల వారి జీవితం చాలా దుర్బరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆదుకోవడం నా ముందున్న తక్షణ కర్తవ్యంగా భావించాను.
నా సిబ్బందిని ఆదుకోవడానికి నా ఏడాది జీతం రూ.2.5 కోట్లు బాలాజీ టెలిఫిలింస్ సిబ్బందికి విరాళంగా అందజేస్తున్నాను. నా సిబ్బందికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకొంటాను. ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కలిసి ఐక్యంగా ముందుకెళ్లాలి. ఇంటి పట్టునే ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ఏక్తా కపూర్ ఓ సందేశాన్ని తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.