Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రభావం చూపిన సర్కార్ చిత్రం!
ఇళయదళపతి విజయ్ తో మురుగదాస్ రూపొందించిన ఈ హ్యాట్రిక్ చిత్రం సర్కార్. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అదే స్థాయిలో వివాదాలని కూడా సృష్టించింది. ఈ చిత్రంలో అధికార అన్నా డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని పెద్ద రచ్చ జరిగింది. ఈ మేరకు దర్శకుడు మురుగదాస్ పై కేసులు కూడా నమోదయ్యాయి.
సర్కార్ చిత్రం ద్వారా ఓ కీలక అంశాన్ని దర్శకుడు ప్రజలందరికి తెలిసేలా చేశాడు. అదే 49 పి సెక్షన్. ఈ చిత్రంలో విజయ్ ఓటు హక్కు దొంగిలించబడుతుంది. ఈ 49 పి సెక్షన్ తోనే విజయ్ దొంగఓట్లపై పోరాటం చేస్తాడు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లని చైతన్య పరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలని చేపడుతోంది. ఇందులో భాగంగా సెక్షన్ 49పి గురించి కూడా ప్రజల్లో అవగాహన పెరిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
దీనిపై మురుగదాస్ స్పందించాడు. ఎన్నికల సంఘం సెక్షన్ 49పి విషయంలో చేస్తున్న ప్రచారాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పట్ల చాలా సంతోషంగా ఉందని మురుగదాస్ తెలిపాడు. సర్కార్ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి నాయికగా నటించింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
Glad, election commission is bringing awareness on #49p #Sarkar pic.twitter.com/SPnk71M7RR
— A.R.Murugadoss (@ARMurugadoss) March 7, 2019