Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సెన్సార్ బోర్డు వద్ద టైటిల్ రచ్చ.. మార్చక తప్పలేదు!
సెన్సార్ బోర్డు సభ్యులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని చిత్రాలు విడుదలయ్యాక వివాదాలుగా మారుతున్నాయి. దీనితో సినిమా సెన్సార్ జరిగే సమయంలోనే అన్ని విషయాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సర్కార్ లాంటి చిత్రాలు విడుదలయ్యాక ఎలాంటి చిత్రాలకు ఎలా అనుమతి ఇస్తారని కొంతమంది సెన్సార్ సభ్యులపైనే విమర్శలు చేశారు. అలాంటి వివాదాలు ఇక రిపీట్ కాకూడదని సెన్సార్ బోర్డు భావిస్తోంది.
ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న 'చీట్ ఇండియా' చిత్రం సెన్సార్ బోర్డు వద్ద రచ్చగా మారింది. ఈ టైటిల్ వివాదభరిత మైనదని.. వెంటనే మార్చండి అని సెన్సార్ సభ్యులు సూచించారు. జనవరి 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కొద్ది రోజుల ముందు టైటిల్ మార్చమంటే ఎలా అని చిత్ర యూనిట్ సెన్సార్ సభ్యులని రిక్వస్ట్ చేసింది. అయినా కూడా సెన్సార్ సభ్యులు ససేమిరా అనడంతో మార్చక తప్పలేదు.
ఈ చిత్ర టైటిల్ని 'వై చీట్ ఇండియా'గా మార్చారు. దీనితో వివాదం తొలగిపోయింది. సౌమిక్ సేన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీకి జోడిగా శ్రేయ ధన్వంతరి హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ ప్రధానంగా ఈ చిత్రం ఉండబోతోంది.