Don't Miss!
- News Shocking Video: గాల్లో ఢీకొన్న రెండు నేవీ హెలికాఫ్టర్లు-10 మంది స్టాఫ్ దుర్మరణం..!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అడగ్గానే కాదనలేకపోయా.. ప్రభాస్తో బాగా ఎంజాయ్ చేశా.. అసలు విషయం బయటపెట్టేసిన హీరోయిన్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా 'సాహో'. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడటంతో దేశ వ్యాప్తంగా అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు బాలీవుడ్ భామలు రొమాన్స్ చేశారు.అందులో ఒకరు మెయిన్ హీరోయిన్ శ్రద్ద కపూర్ కాగా మరోభామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ ఇద్దరితో పాటు మరో భామ కూడా ప్రభాస్ తో కలిసి తెరపంచుకుంది. ఆమెనే ఎవెలిన్ శర్మ. తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టిన ఎవెలిన్.. సాహో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పింది.
ఎవెలిన్ శర్మ నటిస్తోందని తెలుసు.. కానీ
సాహో చిత్రంలో ఎవెలిన్ శర్మ నటించిందని అందరికీ తెలుసిన విషయమే అయినప్పటికీ ఆమె చేసిన పాత్ర ఏంటనేది సీక్రెట్గా ఉంచారు. ఇప్పటిదాకా ప్రమోషన్స్లో కూడా ఈమెపై పెద్ద ఫోకస్ చేయకపోవడంతో ఈ పాత్రపై ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి. సరిగ్గా ఈ తరుణంలో ప్రభాస్తో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ సాహో అవకాశం గురించి ప్రస్తావించింది.
|
అడగ్గానే కాదనలేకపోయా..
''నేను బాహుబలికి అలాగే ప్రభాస్కి పెద్ద ఫ్యాన్ని. ఆయనతో కలిసి పనిచేయడం నాలో సరికొత్త ఉత్తేజాన్ని నింపింది. ‘సాహో'లో నటిస్తారా అంటూ డైరెక్టర్ సుజీత్ నుంచి కాల్ వచ్చినప్పుడు, నేను చెప్పిన ఒకే ఒక్క సమాధానం.. యస్'' అని ఎవెలిన్ శర్మ తన ట్వీట్లో పేర్కొంది.
'బ్యాడ్ బాయ్' ట్రెండింగ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
మరోవైపు శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్తో కలిసి ప్రభాస్ చేసిన స్పెషల్ సాంగ్ యూత్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. 'బ్యాడ్ బాయ్' అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ సాంగ్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్లో కూడా చేరి రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. దీంతో సాహోలో హీరోయిన్స్ పర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ ఉంటుందని అర్థమైంది.
సాహో మూవీ
యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఆగస్టు 30 న ఈ సినిమా విడుదల కానుంది.