Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
F3 షూటింగ్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్: అప్పటి నుంచే మళ్లీ మొదలు పెడతారట
మూడేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో దీనికి 'F3' పేరిట సీక్వెల్ను తీస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం 'F3'. ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభం అయింది. కొండాపూర్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. అయితే, ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కోవిడ్ బారిన పడ్డాడు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను క్యాన్సిల్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం షూటింగ్ను జూన్ మొదటి వారం నుంచి పున: ప్రారంభించబోతున్నారట. ఇందులో భాగంగా సారథి స్టూడియోలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్లో ఇంపార్టెంట్ సీన్స్ తీస్తారని తెలిసింది.
గతంలో వచ్చిన 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)లో పెళ్లి వల్ల ఎదురైన సమస్యలను చూపించిన దర్శకుడు.. 'F3'ని మాత్రం మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సునీల్ కీలక పాత్రను పోషిస్తుండగా.. తెలుగు హీరోయిన్ అంజలి కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.