Don't Miss!
- News పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నారంటే?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
‘పుష్ప’ నుంచి షాకింగ్ న్యూస్: సినిమా మొత్తంలో ఆ హీరో కనిపించేది కాసేపే
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'పుష్ప'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా.. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న ఈ సినిమాపై ఊహించని రీతిలో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏ అప్డేట్ వచ్చినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్కు సంబంధించిన దాదాపు 80 శాతం షూటింగ్ కూడా పూర్తైంది. ఇక, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తోన్నాడు. తాజా సమాచారం ప్రకారం.. మొదటి భాగంలో అతడి పాత్ర కేవలం చివరి 20 నిమిషాలకే పరిమితం అవుతుందట.
అంటే అతడి ఎంట్రీ కూడా ప్రీ క్లైమాక్స్లోనే ఉంటుందని సమాచారం. అక్కడి నుంచి సినిమా ఎండ్ కార్డ్ పడే వరకూ మొత్తంగా కేవలం మూడు, నాలుగు సన్నివేశాల్లోనే ఫహాద్ ఫాజిల్ కనిపిస్తాడని అంటున్నారు. అయితే, రెండో భాగంలో మాత్రం అతడు పూర్తి స్థాయిలో దర్శనమిస్తాడనే టాక్ వినిపిస్తోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. తద్వారా దీనిపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇక, దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.