అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ.. శివరాత్రి తర్వాత క్లారిటీ!

'నా పేరు సూర్య' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కమిటైన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.

శివరాత్రి తర్వాత చిత్ర యూనిట్ నుంచి అపీషియల్ ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. హీరోయిన్, సినిమా లాంచింగ్ డేట్, ఇతర వివరాలు ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తారని టాక్. హీరోయిన్‌గా పూజా హెగ్డే దాదాపు ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Fans wating for Allu Arjun and Trivikram Shivratri announcement

షూటింగ్ మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ స్రిప్టుకు ఫినిషిట్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

గీతా ఆర్ట్స్, హారిక హాసిన క్రియేషన్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ మధ్య కాలంలో సరైన హిట్టులేని అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. గతంలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చిన నేపథ్యంలో అభిమానులు వీరి కాంబినేషన్‌పై ఆసక్తిగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X