Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఇకపై పైరసీ చేస్తే 3 ఏళ్ళు జైలుశిక్ష, 10 లక్షల జరిమానా!
చలనచిత్ర రంగాన్ని పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని వదిలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇకపై పైరసీ దారులు భయపడేలా కఠినమైన చట్టాల కోసం ప్రభుత్వం 1952 బిల్లుకు సరవరణలు జరిపేందుకు అంగీకారం తెపిపింది. పైరసీ వలన చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి చిత్రం నష్టపోతోంది. కానీ చిన్న నిర్మాతలు ఎక్కువగా గగ్గోలు పెడుతున్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పైరసీకి పాల్పడిన వ్యక్తులకు మూడేళ్ళ జైలుశిక్ష లేదా 10 లక్షల జరిమానా విధించనున్నారు. కేసు తీవ్రతని బట్టి రెండు శిక్షలు కూడా అమలయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో పైరసీ వ్యవహారం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. పైరసీ విషయంలో నిర్మాతల మండలి చైర్మన్ గా ఉన్న విశాల్ స్వయంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
తమిళ రాకర్స్ లాంటి పైరసీ సంస్థల్ని గుర్తించడమే కష్టంగా ఉంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టాల వలన ఉపయోగం ఏంటని పెదవి విరిచేవారూ లేకపోలేదు. మనదేశంలో మేధావుల సంపత్తిని కాపాడుకోవడంలో ఇది ముందడుకు అంటూ సిద్ధార్థ్ రాయ్ కపూర్ సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించాడు.