Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పుల్వామా అమరవీరుల కుటుంబాలకు FNCC 4 లక్షల విరాళం
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు మేము సైతం అంటూ FNCC (ఫిలింనగర్ కల్చరల్ సెంటర్) ముందుకొచ్చింది. రూ. 4, 82, 000 సహాయాన్ని ప్రకటించింది. అసోసియేషన్లో ఒక సభ్యుడైన భాసిరెడ్డి నాగఅన్వేష్ తనవంతు సాయంగా లక్ష రూపాయలు అందించారు. రెండు మొత్తాలకు సంబంధించిన చెక్కులను అసోసియేషన్ సభ్యులు సీఆర్పీఎఫ్ కార్యాలయంలో అందచేశారు.
FNCC నుంచి చెక్కులు అందుకున్న సీఆర్పీఎఫ్ కార్యాలయ అధికారి ఐపీఎస్ శ్రీకే దుర్గాప్రసాద్ (మాజీ డీజీపీ), సదరన్ సెక్టార్ ఐజీపీ జీహెచ్పీ రాజు FNCC సభ్యులను అభినందించారు. ఇలాంటి ప్రోత్సాహకాల వల్ల జవాన్ల మనోధైర్యం మరింత బలపడుతుందని ఈ సందర్భంగా ఐజీపీ జీహెచ్పీ రాజు తెలిపారు. ఈ మొత్తాన్ని భారత్ వీర్ అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు.
సీఆర్పీఎఫ్ అధికారులను కలిసి చెక్కులు అందజేసిన వారిలో ఎఫ్ఎన్సీసీ సెక్రెటరీ బి. రాజశేఖర్రెడ్డి, కమిటీ సభ్యులు శ్రీమతి శైలజ జుజాల, పి. రామకిశోర్, కే సదాశివరెడ్డి, వీవీఎస్ఎస్ పెద్దిరాజు, సురేష్ కొండేటి ఉన్నారు.