Don't Miss!
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మంచు వారి ప్రాజెక్టులో మాజీ, తాజా సీఎంలు.. ఆయనపైనే ఎక్కువ ఫోకస్.!
చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు మంచు విష్ణు. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన 'ఢీ' అనే సినిమా మినహా ఆయనకు అంత పెద్దగా పేరు తెచ్చినవి తక్కువే. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం అన్వేషిస్తున్న ఈ మంచు వారి అబ్బాయి.. ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. ఇటీవల 'ఓటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ హీరో పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా వ్యవహరించాడు విష్ణు. ఇకపై సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన ఓ ప్రాజెక్టును ప్రారంభించాడు. అందులో పొలిటికల్ సెటైర్లు వేయబోతున్నారట. ఇంతకీ ఎవరిని టార్గెట్ చేశారు..? వివరాల్లోకి వెళితే...
ఒకేరోజు నాలుగు మొదలెట్టేశాడు
మంచు విష్ణు ఇటీవల ఒకేరోజు నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించాడు. ఈ మేరకు అప్పుడు ట్విట్టర్లో ‘‘ఈరోజు నాలుగు ప్రాజెక్టులను మొదలుపెట్టాను. అందులో రెండు నేను నటించేవి కాగా, మరొకటి వెబ్ సిరీస్, అలాగే ఇంకొకటి ఫీచర్ ఫిల్మ్. నాకు లక్ కలిసి రావాలని కోరుకుంటున్నాను. రెండు సంవత్సరాలు చేతి నిండా పనే'' అంటూ రాసుకొచ్చాడు. ఇప్పటికే తాను నటిస్తున్న రెండు సినిమాలనూ అధికారికంగా ప్రారంభించాడు.
ఏపీ రాజకీయాల్లో పావులు కదిపేలా
ప్రముఖ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ‘చదరంగం' అనే వెబ్ సిరీస్ను కొద్ది రోజుల క్రితం ప్రారంభించాడు విష్ణు. ఈ కార్యక్రమానికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రధాన పాత్రధారి శ్రీకాంత్పై ఆయన క్లాప్ కొట్టి దీన్ని ప్రారంభించారు. ఈ వెబ్ సిరీస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలను చూపించబోతున్నారని తెలుస్తోంది. అది కూడా సెటైరికల్గా ఉంటుందని అనుకుంటున్నారు.
కలకలం రేపిన విష్ణు వ్యాఖ్యలు
నిర్మాత విష్ణు అప్పుడు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక హింట్ ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్ కొంత మందికి వ్యతిరేకంగా ఉండబోతుందని తెలిపాడు. దీంతో ఈ వెబ్ సిరీస్పై ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే ఇది తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు ఈ వెబ్ సిరీస్ ఎవరికి వ్యతిరేకంగా ఉండబోతుంది..? ఎవరిని ఇందులో టార్గెట్ చేశారు..? అనేది ఆసక్తికరంగా మారింది.
ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రస్తావన
ఈ వెబ్ సిరీస్లో ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రస్తావన ఉంటుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అందులో ఇద్దరు మాజీ సీఎంలైన రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాగా, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరొకరని సమాచారం. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన మరణించే వరకు ఈ వెబ్ సిరీస్ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ పాత్రను కూడా చూపిస్తారట.
ఆయనపైనే ఎక్కువ ఫోకస్
మంచు విష్ణు తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ మొత్తం ఓ మాజీ సీఎం, పార్టీ అధినేతను ఫోకస్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు, ఆయన పార్టీని వ్యతిరేకంగా చూపించబోతున్నారని కూడా అంటున్నారు. గతంలో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఇది బయటకు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.