Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
విడుదలైన వారానికే ఓటీటీలోకి ‘గాలి సంపత్’: అధికారికంగా ప్రకటించిన ప్రముఖ సంస్థ
ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లకే వెళ్లాల్సిన పరిస్థితి. కొన్నేళ్లకు టీవీలు అందుబాటులోకి రావడంతో విడుదలైన చాలా రోజులకు ఇంటిల్లిపాది కూర్చుని వాటిని తిలకించేవారు. అయితే, ఇప్పుడా పరిస్థితులు లేవు. థియేటర్లలోకి సినిమా వచ్చిన కొన్ని వారాలకే ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకూ ఇన్ని రోజుల అని ఓ లెక్క ఉండేది. కానీ, ఈ మధ్య దాన్ని ఎత్తేయడంతో చాలా తక్కువ సమయంలోనే కొత్త సినిమాలు ఓటీటీల్లో విడుదలైపోతున్నాయి. ఇందులో భాగంగానే ఓ సినిమా విడుదలైన వారానికే స్ట్రీమింగ్ కానుంది. అదే 'గాలి సంపత్'.
అనిష్ కృష్ణ దర్శకత్వంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'గాలి సంపత్'. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. టాక్ మంచిగానే వచ్చినప్పటికీ.. 'జాతి రత్నాలు', 'శ్రీకారం' చిత్రాల నుంచి పోటీ విపరీతంగా ఉండడంతో మొదటి వారంలోనే దాదాపుగా థియేటర్ల నుంచి మాయమైపోయిందీ చిత్రం. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మార్చి 19 నుంచి అంటే విడుదలైన తొమ్మిదో రోజే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
'గాలి సంపత్'ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుగు సంస్థ ఆహా అధికారికంగా ప్రకటన కూడా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 'ఫ ఫ ఫ ఫన్తో కూడిన ఎంటర్టైనర్ మీ ముందుకు వచ్చేస్తుంది' అంటూ ఓ ట్వీట్ కూడా చేసింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించాడు. షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఎస్ కృష్ణ దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన లవ్లీ సింగ్ హీరోయిన్గా నటించింది.