Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మళ్లీ వెండితెరపై ప్రజాగాయకుడు గద్దర్.. హీరోగా మారిన సుడిగాలి సుధీర్ కోసం!
Recommended Video
సుడిగాలి సుధీర్ హీరోగా, ధన్యాబాలకృష్ణ హీరోయిన్గా శేఖర ఆర్ట్ క్రియేషన్స్ బేనర్పై ప్రొడక్షన్ నెం-1గా కె.శేఖర్రాజు నిర్మిస్తున్న చిత్రం 'సాఫ్ట్వేర్ సుధీర్'. ఈ సినిమా ద్వారా రాజశేఖర్రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్న గద్దర్ ఇప్పుడు 'మేలుకో రైతన్నా.. మేలుకో' అంటూ మరో సందేశాత్మక గీతంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'సాఫ్ట్వేర్ సుధీర్' చిత్రంలోని ఈ పాటను రచించి గానం చేశారు. యువతరాన్ని రైతాంగంతో కలిసి నడవమని చెప్పే చక్కని సందేశంతో కూడిన ఈ పాటలో గద్దర్ స్వయంగా నటించడం విశేషం.
మేలుకో రైతన్న గేయంతో
ఈ పాట గురించి ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ - ''సాఫ్ట్వేర్ సుధీర్ చిత్రంలో 'మేలుకో రైతన్నా.. మేలుకో.. నువ్వు కోలుకో రైతన్నా.. కోలుకో' అనే పాటను రచించి పాడాను. అలాగే సినిమాలోని ఆ పాటలో నేను నటించడం కూడా జరిగింది. యువతరాన్ని రైతాంగంతో కలిసి నడవమని చెప్పే మంచి పాటను రాసి నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ శేఖర్ రాజు, దర్శకుడు రాజశేఖర్గారికి వందనాలు. రైతుల గురించి మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు ప్రజల్లోకి వెళ్లి ఆ రైతాంగాన్ని కదిలిస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు.
గద్దర్ నా సినిమాలో పాడటంతో
హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ - ''కథ చాలా ఎగ్జయిటింగ్గా అనిపించించి ఈ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించాను. నా తల్లితండ్రులు చేసిన పూజల ఫలితంగానే హీరోగా నేను నటిస్తున్న మొదటి సినిమాకే ఇంత గొప్ప టెక్నిషియన్స్తో కలిసి వర్క్ చేసే అవకాశం దొరికింది. హీరోయిన్ ధన్యా బాలకష్ణతో షూటింగ్ చాలా ఫన్గా సాగుతోంది. అలాగే దర్శకుడు రాజశేఖర్ రెడ్డిలో మంచివిజన్ ఉంది. మా సినిమాలో గద్దర్ వంటి ప్రముఖ గాయకుడు పాట పాడడం, నటించడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా తప్పకుండా మీ అందరి అంచనాలను అందుకుంటుంది'' అన్నారు.
కేవలం గద్దర్ పాడటమే కాదు.. నటించడం
ప్రొడ్యూసర్ కె.శేఖర్రాజు మాట్లాడుతూ - ''సినిమా రంగంపై ఉన్న ఫ్యాషన్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాను. దర్శకుడు ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ నుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఆ భగవంతుడి దయ వలన షూటింగ్ సజావుగా సాగుతోంది. మా సినిమాలోని ఓ ఇన్స్పైరింగ్ సాంగ్ను ప్రజాగాయకుడు గద్దర్ పాడడంతోపాటు సినిమాలో నటించారు కూడా. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
మేలుకో రైతన్న పాట సినిమాకు ఎసెట్గా
దర్శకుడు
రాజశేఖర్రెడ్డి
పులిచర్ల
మాట్లాడుతూ
-
''కమర్షియల్
ఫ్యామిలీ
ఎంటర్టైనర్తో
పాటు
మంచి
సందేశాత్మక
చిత్రం
ద్వారా
మీ
ముందుకు
వస్తున్నందుకు
సంతోషంగా
ఉంది.
మా
సినిమాకు
గద్దర్గారి
పాట
పెద్ద
ఎస్సెట్
అవుతుంది.
యువతకు
మంచి
సందేశాన్నిచ్చే
'మేలుకో
రైతన్నా..'
పాటను
రచించి
ఎంతో
ఇన్స్పైరింగ్గా
పాడడమే
కాకుండా
సినిమాలో
నటించడం
నిజంగా
మా
అదృష్టం''
అన్నారు.
హీరోయిన్
ధన్య
బాలకృష్ణ
మాట్లాడుతూ
-
''ఇందులో
పెర్ఫార్మెన్స్
ఓరియంటెడ్
క్యారెక్టర్
చేస్తున్నాను.
ఈ
సినిమాలో
ఎంటర్టైన్మెంట్తోపాటు
మంచి
సందేశం
కూడా
ఉంది''
అన్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
సుడిగాలి
సుధీర్,
ధన్య
బాలకృష్ణ,
గద్దర్,
సీనియర్
నటి
ఇంద్రజ,
పోసాని
కృష్ణమురళి,
షాయాజీ
షిండే,
శివప్రసాద్,
విద్యుల్లేఖ,
టార్జాన్
తదితరులు
ఎడిటర్:
గౌతమ్రాజు,
సినిమాటోగ్రఫీ:
రామ్ప్రసాద్,
మ్యూజిక్:
భీమ్స్
సిసిరోలియో,
ఫైట్స్:
రామ్లక్ష్మణ్,
డాన్స్:
శేఖర్
మాస్టర్,
పబ్లిసిటీ
డిజైనర్:
ధని
ఏలె,
ఆర్ట్
డైరెక్టర్:
నారాయణ
ముప్పాల,
ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్:
భిక్షపతి
తుమ్మల,
పాటలు:
సురేష్
ఉపాధ్యాయ,
ప్రొడ్యూసర్:
కె.శేఖర్రాజు,
కథ,
మాటలు,
స్క్రీన్ప్లే,
దర్శకత్వం:
రాజశేఖర్రెడ్డి
పులిచర్ల.