Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ మరో రికార్డ్...
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం 59 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతోంది.
మామూలు మధ్యస్థాయి సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం నమోదు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. గీతాఆర్ట్స్ 2 బేనర్లో బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
అప్పటికే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' చిత్రంతో వంద కోట్లు వసూలు చేసే సత్తా ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
టాలీవుడ్ చరిత్రలోనే ఈ మూవీ సంచలన విజయం అందుకుంది. కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 125 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో నాగబాబు, సుబ్బరాజు, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా విడుదల ముందే కొన్ని సీన్లు లీక్ కావడం నిర్మాతలను కాస్త కంగారు పెట్టినా... వసూళ్లపై ఆ ఎపెక్ట్ పడక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Thank You All For Giving Big... Bigger... Biggest Hit in Recent Times -- @GA2Official
— GA2 Pictures (@GA2Official) October 3, 2018
Blockbuster #GeethaGovindam Completes 50 Days in 59 Centres!@TheDeverakonda @iamRashmika @ParasuramPetla #GopiSunder @maniDop #BunnyVas #AlluAravind pic.twitter.com/PKtpqbIKY7
కాగా... విజయ్ దేవరకొండ ఈ నెల 5న 'నోటా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతోంది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.