Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గీత గోవిందం దర్శకుడు మళ్ళీ మెగా బ్యానర్లోనే!
గీత గోవిందం చిత్రంతో పరశురామ్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. ఈ ఏడాది విడుదలైన గీత గోవిందం చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. విజయ్, దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాల తరహాలో 70 కోట్ల షేర్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. అంతకు ముందుకు పరశురామ్ తెరకెక్కించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రం కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే తెరకెక్కింది.
ప్రస్తుతం పరశురామ్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో హ్యాట్రిక్ చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పరశురామ్ తదుపరి తెరకెక్కించబోయే చిత్రానికి కథ సిద్ధం చేశారట. గీత ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారో తెలియాల్సి ఉంది.
మరోవైపు పరశురామ్ మైత్రి మూవీస్ వారితో కూడా ఓ చిత్రానికి కమిటై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలలో ఏది ముందుగా ప్రారంభం అవుతుందో తెలియాల్సి ఉంది. రొమాంటిక్ కథలతో మ్యాజిక్ చేయడం పరశురామ్ ప్రత్యేకత. ఈ సారి పరశురామ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.