Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మిస్సింగ్ మూమెంట్: భర్త నందు సినిమా రిలీజ్ వేళ పాపం గీతా మాధురి ఇలా!
బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సింగర్ గీతా మాధురి తన భర్త నందు హీరోగా నటించిన 'ఎందుకో ఏమో' సినిమా రిలీజ్ మిస్సవ్వబోతోంది. ఆమె ఇంటి నుండి బయటకు రాకముందే ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది.
మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు, నోయల్, పునర్నవి భూపాలం హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం 'ఎందుకో ఏమో'. ఈ చిత్రం సెప్టెంబర్ 12న వినాయక చవితి సందర్భంగా విడుదలవుతుంది.
ఇదొక ట్రయాంగిల్ వ్స్టోరి. ఫ్యామిలీ, యూత్ కి నచ్చే విధంగా సినిమా తెరకెక్కించామని దర్శకుడు కోటి వద్దినేని తెలిపారు. నందు, నోయల్,పునర్నవి పోటా పోటీగా నటించారని, క్లైమాక్స్ సినిమాకు హైలైట్గా ఉంటుందన్నారు.
నిర్మాత మాలతి వద్దినేని మాట్లాడుతూ...''నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. మంచి కాన్సెప్ట్స్తో వచ్చే చిత్రా లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా మంచి కాన్సెప్ట్తో వచ్చే సినిమా ఇది . మా యూనిట్ అంతా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో సినిమాను అనుకున్నవిధంగా పూర్తి చేయగలిగామని తెలిపారు.
నందు, నోయల్, పునర్నవి, పోసాని, సూర్య, సుడిగాలి సుధీర్, నవీన్, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంఃప్రవీణ్, కెమెరా: జియస్ రాజ్, ఎడిటింగ్: మధు, ఆర్ట్: వర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, నిర్మాత: మాలతి వద్దినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కోటి వద్దినేని.