Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరంజీవి మూవీ టైటిల్ ‘కింగ్ మేకర్’ కాదు: పవర్పుల్ పేరునే ఫిక్స్ చేసిన టీమ్
కొంత కాలంగా వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటూ ఫుల్ జోష్తో కనిపిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ధీటుగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న ఆయన.. రీఎంట్రీలో ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకుల ముందు ఉంచారు. అలాగే, ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇది షూటింగ్ పూర్తి కాకముందే మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్'ను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిలిం నగర్లో వైరల్ అవుతోంది.
మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రమే 'లూసీఫర్'. దీన్ని చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ విషయంలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీనికి పలానా పేరు పెడుతున్నారని చాలా టైటిళ్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు 'గాడ్ ఫాదర్' అనే టైటిల్నే ఫిక్స్ చేశారట. ఇప్పటికే దీన్ని ఫిలిం ఛాంబర్లో సైతం నిర్మాతలు రిజిస్టర్ చేశారని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
గ్లామరస్ ఫొటోలతో అను ఇమాన్యూయేల్ రచ్చ: గతంలో ఎన్నడూ చూడని ఫోజులతో కవ్విస్తోన్న బ్యూటీ
పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో సాగే ఈ సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టారని అంటున్నారు. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఆగస్టు 13 నుంచి ప్రారంభం కాబోతుందని మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుందని తెలుస్తోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందించబోతున్నాడు.