Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవి మూవీ టైటిల్ ‘కింగ్ మేకర్’ కాదు: పవర్పుల్ పేరునే ఫిక్స్ చేసిన టీమ్
కొంత కాలంగా వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంటూ ఫుల్ జోష్తో కనిపిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ధీటుగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న ఆయన.. రీఎంట్రీలో ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకుల ముందు ఉంచారు. అలాగే, ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇది షూటింగ్ పూర్తి కాకముందే మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్'ను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిలిం నగర్లో వైరల్ అవుతోంది.
మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రమే 'లూసీఫర్'. దీన్ని చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ విషయంలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీనికి పలానా పేరు పెడుతున్నారని చాలా టైటిళ్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు 'గాడ్ ఫాదర్' అనే టైటిల్నే ఫిక్స్ చేశారట. ఇప్పటికే దీన్ని ఫిలిం ఛాంబర్లో సైతం నిర్మాతలు రిజిస్టర్ చేశారని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది.
గ్లామరస్ ఫొటోలతో అను ఇమాన్యూయేల్ రచ్చ: గతంలో ఎన్నడూ చూడని ఫోజులతో కవ్విస్తోన్న బ్యూటీ
పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో సాగే ఈ సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టారని అంటున్నారు. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఆగస్టు 13 నుంచి ప్రారంభం కాబోతుందని మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుందని తెలుస్తోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందించబోతున్నాడు.