Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బాలయ్య - బోయపాటి మరో పవర్ఫుల్ టైటిల్: ఇదే ఫైనల్ అంటున్నారు
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. దాదాపు నలభై ఏళ్లుగా తన హవాను చూపిస్తోన్న ఆయన.. ఎన్నో విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండేళ్లుగా ఆయన వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి హిట్లను ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో జత కట్టారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్ను ప్రకటించలేదు. కానీ, గతంలో 'మోనార్క్' అని, 'సూపర్మేన్' అని కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక, ఇటీవల దీనికి 'ధర్మ' అనే పేరు పెడుతున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు 'గాడ్ఫాదర్' అనే టైటిల్ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర నిర్మాత ఈ పేరును ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేయించారని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయని ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
రెండు భారీ విజయాల తర్వాత బాలయ్య.. బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాను పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. ఇందులో నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, పవర్ఫుల్ రైతు పాత్రలోనూ ఆయన కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేస్తుండగా.. సామ్నా ఖాసీం అలియాస్ పూర్ణ మరో లీడ్గా చేస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.