Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అక్కినేని ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేయనున్న నాగార్జున
పేరుకు సీనియర్ హీరోనే అయినా అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు అక్కినేని నాగార్జున. కేవలం ఆ విషయంలోనే కాదు.. సినిమాలు చేయడంలోనూ.. వ్యాపార ప్రకటనలు.. టీవీ షోలు ఇలా అన్నింటిలోనూ ఆయన టాలీవుడ్ హీరోలు అందరికంటే ముందే ఉన్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే, బుల్లితెరపైనా కొన్ని షోలతో మెప్పిస్తున్నాడు. ఇటీవలే బిగ్ బాస్ షోను పూర్తి చేసుకున్న నాగ్.. త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నాడట. ఇంతకీ ఏంటా ప్రకటన..? వివరాల్లోకి వెళితే...
మన్మథుడిగా వచ్చి నిరాశ పరిచాడు
అక్కినేని నాగార్జున.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2' అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో నాగ్ కెరీర్లోనే ఓ డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఇందులో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమా అక్కినేని అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పాలి.
బిగ్ బాస్ షోతో ఊరటనిచ్చాడు
నాగార్జున సినిమాతో తన అభిమానులను నిరాశ పరిచినప్పటికీ, ‘బిగ్ బాస్' షోతో మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ సీజన్కు హోస్టింగ్ బాధ్యతలు నిర్వహించిన నాగ్.. టీఆర్పీ రికార్డులను సైతం బద్దలు కొట్టేశాడు. ఫలితంగా సినిమా ఫలితంతో నిరాశ చెందిన అభిమానులకు ఊరటను కలిగించాడు. ఈ షోలో నాగ్ బాడీ లాంగ్వేజ్ కూడా అందరిని మెప్పించిందనే చెప్పాలి.
సినిమా విషయంలో జాగ్రత్తలు
‘మన్మథుడు 2' సినిమా డిజాస్టర్గా మిగలడంతో నాగార్జున తన తదుపరి చిత్రాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కొద్ది సంవత్సరాలుగా సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కినేని అందగాడు.. ఈ సారి ఎలాగైన సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం కథల ఎంపిక సరిగా ఉండాలనుకుంటున్నారట.
కొత్తగా వెళ్లాలని నిర్ణయం
ఇప్పటి వరకు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన నాగార్జున.. ఇకపై సరికొత్తగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కథలో వైవిధ్యం చూపించాలన్న ఉద్దేశ్యంతోనే ఇప్పటి వరకు సినిమాను ఓకే చేయలేదని ఫిలిం నగర్లో ఓ టాక్ వినిపిస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి కూడా ఆయన సిద్ధం అవుతున్నట్లు వినికిడి.
త్వరలోనే గుడ్ న్యూస్
అక్కినేని అభిమానులకు నాగార్జున త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారట. అది మరేంటో కాదు.. తన కొత్త సినిమా ప్రకటన గురించి. అవును.. నాగ్ కొద్ది రోజుల్లో తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నాడని సమాచారం. దీని ద్వారా సాల్మాన్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడట. అతడు గతంలో ‘ఊపిరి' సినిమాకు రైటర్గా పని చేశాడు.