Don't Miss!
- News rasi phalalu today: ఈ రాశులవారు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
'డాన్ శ్రీను', 'బలుపు' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత మాస్ మహారాజా రవితేజ - యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'క్రాక్'. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను దాటేసి లాభాల బాటలో పయనించింది. ఇప్పటి వరకు దాదాపు రూ. పది కోట్లకు పైగా ఆదాయాన్ని అందుకున్న ఈ చిత్రం.. చాలా ప్రాంతాల్లో హౌస్ఫుల్ షోలతో సత్తా చాటుతోంది. దీంతో ఈ మూవీ డైరెక్టర్కు భారీ డిమాండ్ ఏర్పడింది.
'క్రాక్'తో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఆ సినిమాలో హీరో రవితేజను ఆయన చూపించిన విధానానికి ప్రేక్షకులతో పాటు చాలా మంది హీరోలు కూడా ఫిదా అయిపోయారు. ఈ కారణంగానే అతడితో సినిమా చేసేందుకు తెలుగులోని చాలా మంది హీరోలు పోటీ పడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎనర్జిటిక్ డైరెక్టర్ నటసింహా నందమూరి బాలకృష్ణతో ఓ పవర్ఫుల్ మూవీ చేయబోతున్నాడని కొద్ది రోజులుగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా గోపీచంద్ మలినేని ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టులతో పాటు నందమూరి బాలకృష్ణ సినిమా ఉంటుందా ఉండదా అన్న దానిపైనా వివరణ ఇచ్చారు. 'గత పదేళ్లలో నేను చాలా తక్కువ సినిమాలే చేశాను. కానీ, రాబోయే పదేళ్లలో పాటు రెట్టింపు సినిమాలు చేయబోతున్నా. ఇక, బాలయ్యతో సినిమా ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పలేను. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా ఉండే ఛాన్స్ ఉంది' అంటూ గోపీచంద్ చెప్పుకొచ్చాడు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.