Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘క్రాక్’ విడుదల కాకముందే మరోసారి వాళ్లిద్దరి కాంబో సెట్: ఆరోజే ప్రకటించే అవకాశం
స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి.. అద్భుతమైన టాలెంట్తో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు మాస్ మహారాజా రవితేజ. ఏజ్ మీద పడుతున్నా ఏమాత్రం తగ్గకుండా ముందుకు దూసుకెళ్తున్నాడాయన. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను లైన్లో పెడుతోన్న రవితేజ.. ప్రస్తుతం 'క్రాక్' అనే సినిమాతో రెడీగా ఉన్నాడు. దీనితో పాటు 'ఖిలాడీ' అనే మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో మాస్ మహారాజా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన 'క్రాక్' సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న 'ఖిలాడీ' కోసం సిద్ధం అయ్యాడాయన. ఇటీవలే సెట్స్ మీద దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి 'ఇన్ యాక్షన్ మోడ్' అంటూ క్రేజీ క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నూతన సంవత్సరం కానుకగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది.
ఈ రెండు చిత్రాల తర్వాత రవితేజ నటించబోయే ప్రాజెక్టు గురించి ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. 'ఖిలాడీ' తర్వాత మాస్ మహారాజా.. గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్లో 'డాన్ శ్రీను', 'బలుపు' వంటి హిట్లు వచ్చాయి. ఇప్పుడు మూడో 'క్రాక్' రాబోతుంది. ఇది విడుదల కాకముందే వీళ్లిద్దరూ మరోసారి కలిసి పని చేయాలని డిసైడ్ అయ్యారట. దీనికి సంబంధించి 'క్రాక్' సక్సెస్ మీట్ కార్యక్రమంలోనే ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.