Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలయ్య కోసం చరిత్రను తవ్వుతోన్న గోపీచంద్: లైబ్రెరీలో గడుపుతోన్న క్రియేటివ్ డైరెక్టర్
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో గోపీచంద్ మలినేని ఒకడు. శ్రీహరి హీరోగా నటించిన పోలీస్ సినిమాకు సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన అతడు.. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ, శ్రీను వైట్ల, మురుగదాస్, శ్రీవాస్, మెహర్ రమేష్ సహా ఎంతో మంది దగ్గర అసిస్టెంట్గా పని చేశాడు. ఈ క్రమంలోనే 'డాన్ శీను' ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 'పండగ చేస్కో', 'బలుపు', 'బాడీగార్డ్', 'విన్నర్' వంటి వినోదాత్మక సినిమాలు చేశాడు. ఇక, ఈ ఏడాది ఆరంభంలోనే రవితేజతో 'క్రాక్' అనే సినిమాను చేసి సత్తా చాటాడు.
ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన 'క్రాక్' మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతో అటు హీరో మాస్ మహారాజా రవితేజ.. ఇటు దర్శకుడు గోపీచంద్ మలినేని ఇద్దరూ ఒకేసారి హిట్ ట్రాక్ ఎక్కారు. దీనికి కలెక్షన్లు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమా విజయం అందించిన జోష్లో ఉన్న గోపీచంద్ మలినేని.. వెంటనే నటసింహా నందమూరి బాలకృష్ణకు ఓ స్టోరీ లైన్ వినిపించాడు. దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో అధికారికంగానే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇందుకోసం ఎప్పుడో స్క్రిప్ట్ వర్కును కూడా ప్రారంభించేశాడు.
బాలకృష్ణతో చేయబోయే సినిమాను కూడా నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నాడు గోపీచంద్ మలినేని. ఇందులో భాగంగానే తాజాగా అతడు తన సొంత జిల్లా ప్రకాశంకు వెళ్లాడు. అక్కడ ఉన్న జిల్లా లైబ్రెరీలో వేటపాలెం గ్రామానికి సంబంధించిన వందేళ్ల చరిత్ర గురించి పరిశోధనలు జరుపుతున్నాడు. దీనికి సంబంధించిన పిక్ కూడా బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది.