Don't Miss!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బాలయ్య కోసం చరిత్రను తవ్వుతోన్న గోపీచంద్: లైబ్రెరీలో గడుపుతోన్న క్రియేటివ్ డైరెక్టర్
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో గోపీచంద్ మలినేని ఒకడు. శ్రీహరి హీరోగా నటించిన పోలీస్ సినిమాకు సహాయ దర్శకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన అతడు.. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ, శ్రీను వైట్ల, మురుగదాస్, శ్రీవాస్, మెహర్ రమేష్ సహా ఎంతో మంది దగ్గర అసిస్టెంట్గా పని చేశాడు. ఈ క్రమంలోనే 'డాన్ శీను' ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 'పండగ చేస్కో', 'బలుపు', 'బాడీగార్డ్', 'విన్నర్' వంటి వినోదాత్మక సినిమాలు చేశాడు. ఇక, ఈ ఏడాది ఆరంభంలోనే రవితేజతో 'క్రాక్' అనే సినిమాను చేసి సత్తా చాటాడు.
ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన 'క్రాక్' మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతో అటు హీరో మాస్ మహారాజా రవితేజ.. ఇటు దర్శకుడు గోపీచంద్ మలినేని ఇద్దరూ ఒకేసారి హిట్ ట్రాక్ ఎక్కారు. దీనికి కలెక్షన్లు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమా విజయం అందించిన జోష్లో ఉన్న గోపీచంద్ మలినేని.. వెంటనే నటసింహా నందమూరి బాలకృష్ణకు ఓ స్టోరీ లైన్ వినిపించాడు. దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో అధికారికంగానే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇందుకోసం ఎప్పుడో స్క్రిప్ట్ వర్కును కూడా ప్రారంభించేశాడు.
బాలకృష్ణతో చేయబోయే సినిమాను కూడా నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నాడు గోపీచంద్ మలినేని. ఇందులో భాగంగానే తాజాగా అతడు తన సొంత జిల్లా ప్రకాశంకు వెళ్లాడు. అక్కడ ఉన్న జిల్లా లైబ్రెరీలో వేటపాలెం గ్రామానికి సంబంధించిన వందేళ్ల చరిత్ర గురించి పరిశోధనలు జరుపుతున్నాడు. దీనికి సంబంధించిన పిక్ కూడా బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది.