Don't Miss!
- News Arvind Kejriwal..జైల్లో కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడిపండ్లే: ఈడీ చీప్ అభియోగాలు
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ దేశాల్లోనూ పంజా వైష్ణవ్ తేజ్ దూకుడు: కేవలం ఒకే ఒక్క సినిమాతోనే ఓ రేంజ్లో రచ్చ
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో టాలెంట్ ఉన్న వాళ్లు మాత్రమే సత్తా చాటుతున్నారు. ఇక, మరికొందరైతే బడా ఫ్యామిలీల బ్యాగ్రౌండ్తో ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులోనూ అన్ని రకాల టాలెంట్లు ఉన్న వాళ్లే సక్సెస్ అవుతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిపోయారు. ఇక, ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై.. మొదటి చిత్రంతోనే ఎవరూ ఊహించని విధంగా భారీ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఒకే ఒక్క సినిమాతో అతడు ఎనలేని గుర్తింపును అందుకున్నాడు.
Bigg Boss: ఆ కంటెస్టెంట్కు బుల్లితెర బ్యూటీల సపోర్ట్.. కొత్త విషయాలు బయటకు.. ఆమెకు కూడా భారీగానే!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడైన వైష్ణవ్ తేజ్.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పని చేసిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేసిన చిత్రం 'ఉప్పెన'. పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. తద్వారా బాక్సాఫీస్పై దండయాత్ర చేసిన ఈ యంగ్ హీరో.. మొదటి సినిమాతోనే యాభై కోట్ల రూపాయల క్లబ్లో చేరిపోయి టాలీవుడ్లో రికార్డును క్రియేట్ చేశాడు. దీంతో అతడికి హీరోగా అదిరిపోయే ఎంట్రీ దక్కినట్లైంది. ఇక, ఇందులో నటుడిగానూ వైష్ణవ్ తేజ్ మెప్పించాడు. తద్వారా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు.
'ఉప్పెన' మూవీ ప్రేక్షకుల ముందుకు రాకముందే తన రెండో చిత్రం 'కొండపొలం'ను పూర్తి చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి అయ్యాయి. కానీ, అనివార్య కారణాల వల్ల దీని నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మరోసారి తెరపైకి తీసుకు రావడంతో పాటు త్వరలోనే ప్రేక్షకుల ముందు ఉంచాలని మూవీ యూనిట్ నిర్ణయించుకుంది. దీంతో దీన్ని అక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
బెడ్పై అర్ధనగ్నంగా ఇలియానా రచ్చ: వామ్మో అదొక్కటి అడ్డు లేకుంటే అంతే సంగతులు
వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న 'కొండపొలం' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే, సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను ఓవర్సీస్లోనూ గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అక్కడ ఈ చిత్రాన్ని గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ సంస్థ విడుదల చేస్తుందట. ఇందుకోసం భారీ స్థాయిలో లొకేషన్స్ను బుక్ చేసి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రీమియర్స్ కూడా వేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
సందేశాత్మక కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను 'కొండపొలం' అనే నవల ఆధారంగా రూపొందించినట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి అదే టైటిల్ పెట్టారు. ఫుల్ ఎమోషన్స్తో సాగే ఈ మూవీ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కింది. దీన్ని రాజీవ్ రెడ్డి - జాగర్లమూడి సాయిబాబా కలిసి నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.