Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్టీఆర్కు కేసీఆర్ పరామర్శ.. చంద్రబాబుతో మాట్లాడుతూ..
సినీ నటుడు, మాజీ మంత్రి, ఎంపీ హరికృష్ణ మృతికి సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం ఎన్టీఆర్, కల్యాణ్ రాంను పరామర్శించారు.
తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్బంగా తనకు ఎదురుపడిన ఏపీ సీఎం చంద్రబాబును పలకరించారు. కాసేపు ఆగి వారిద్దరూ మాట్లాడుకొన్నారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్, మంత్రి శ్రీనివాస యాదవ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఉన్నారు. చంద్రబాబు వెంట టీడీపీ తెలంగాణ నేత రమణ తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి చెప్పారు.