twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌కు కేసీఆర్ పరామర్శ.. చంద్రబాబుతో మాట్లాడుతూ..

    By Rajababu
    |

    సినీ నటుడు, మాజీ మంత్రి, ఎంపీ హరికృష్ణ మృతికి సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం ఎన్టీఆర్, కల్యాణ్ రాంను పరామర్శించారు.

    తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు.

    Harikrishna Death: KCR condelenced Jr. NTR

    ఈ సందర్బంగా తనకు ఎదురుపడిన ఏపీ సీఎం చంద్రబాబును పలకరించారు. కాసేపు ఆగి వారిద్దరూ మాట్లాడుకొన్నారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్, మంత్రి శ్రీనివాస యాదవ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఉన్నారు. చంద్రబాబు వెంట టీడీపీ తెలంగాణ నేత రమణ తదితరులు ఉన్నారు.

    మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి చెప్పారు.

    English summary
    Nandamuri Harikrishna passed away early on Wednesday following an accident on the Narketpally-Addanki highway in Nalgonda district. Telangana CM KCR went to Harikrishna home and pays his respect. Telangana government decided to organise Harikrishna last rites as per state honour.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X