Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఒకరి చావు నాకు బోలెడు రిలీఫ్ ఇస్తుందని అనుకోలేదు: హరీష్ శంకర్ కామెంట్స్
ఓ వైపు కరోనా కలకలం.. మరోవైపు నిర్భయ దోషుల ఉరికంబం. ఈ రెండు అంశాలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రెండింటి పైనా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ తమ తమ అభిప్రాయాలు, సూచనలు పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హరీష్ శంకర్ రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు.
ఒకరి చావు నాకు బోలెడు రిలీఫ్ ఇస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. అలాగే కొంత మందికి భయాన్నిస్తే చాలు !!! అంటూ హరీష్ శంకర్ సందేశమిచ్చారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు హరీష్ని సమర్థిస్తూ రియాక్ట్ అవుతున్నారు. ''ఆ భయం అనేది ఉండాలంటే ఇలాంటి శిక్షలే త్వరితగతిన అమలుకావాలి'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఒకరి చావు నాకు బోలెడు relief ఇస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు ..... అలాగే
— Harish Shankar .S (@harish2you) March 20, 2020
కొంత మందికి
భయాన్నిస్తే చాలు !!!
ఈ రోజు (శుక్రవారం) ఉదయం నిర్భయ దోషుల ఉరితీతపై హరీష్ ఈ రకంగా స్పందించడం చూసి.. ఎస్ ట్రూ.. నీవు ఎప్పుడూ కరెక్ట్ గానే చెబుతావు అని ఆయన అభిమానులు అంటున్నారు. 2012 నిర్భయ హత్యాచారం కేసులో నిందితులైన మొత్తం నలుగురు ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను నేటి ఉదయం 5 గంటల 30 నిమిషాలకు పారామిలటరీ బలగాల భద్రత మధ్య ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీశారు. ఈ అంశంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.